రైతులకు రుణమాఫీ పథకం అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. మూడేళ్లలో ఎరువుల ధరలు 200 శాతం పెరిగాయని వరి మద్దతు ధర మాత్రం 25 శాతం మాత్రమే పెరిగిందని ఆమె లేఖలో పేర్కొన్నారు.
విత్తనాల ధరలు, ఎరువుల ధరలు, కూలీల వ్యయం, డీజిల్ రేట్లు భారీగా పెరిగి పోయాయని, అందుకు తగ్గట్టుగా మద్దతు ధరలు పెరగడం లేదన్నారు. 2010లో యూరియా బస్తా ధర 250 ఉంటే 2012కు 300 అయిందని.. అలాగే డీఏపీ ధర 500 నుంచి 1250 అయిందని.. పొటాష్ రేటు 225 నుంచి 1000 రూపాయలకు చేరాయని విజయమ్మ గుర్తు చేశారు. రైతులను ఆదుకోవాలని విజయమ్మ ప్రధానిని కోరారు.
విత్తనాల ధరలు, ఎరువుల ధరలు, కూలీల వ్యయం, డీజిల్ రేట్లు భారీగా పెరిగి పోయాయని, అందుకు తగ్గట్టుగా మద్దతు ధరలు పెరగడం లేదన్నారు. 2010లో యూరియా బస్తా ధర 250 ఉంటే 2012కు 300 అయిందని.. అలాగే డీఏపీ ధర 500 నుంచి 1250 అయిందని.. పొటాష్ రేటు 225 నుంచి 1000 రూపాయలకు చేరాయని విజయమ్మ గుర్తు చేశారు. రైతులను ఆదుకోవాలని విజయమ్మ ప్రధానిని కోరారు.
0 comments:
Post a Comment