Home »
» ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం
ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం
నల్గొండ : వైఎస్ షర్మిల శనివారం నల్గొండ జిల్లా వాడపల్లి నుంచి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర నల్లగొండ జిల్లా వాడపల్లి వంతెన మీదుగా గుంటూరు జిల్లా పొందుగల గ్రామంలోకి ప్రవేశించనుంది. గుంటూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 300 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.
నేడు ఆమె 9 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల18నే పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించాల్సించాల్సి ఉన్నప్పటికీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, హైదరాబాద్లో బాంబు పేలుళ్ల మృతులకు సంతాప సూచకంగా యాత్ర వాయిదా పడింది
|
|
0 comments:
Post a Comment