రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో ఘోరంగా విఫలమమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. తన వైఫల్యాలను కప్పిబుచ్చుకునేందుకు నిత్యవసర ధరలను పెంచి సామాన్యుల నడ్డివిరుస్తుందని ఆమె మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయమ్మ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.
అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ప్రధాన ప్రతిపక్షం నేత చంద్రబాబే ప్రభుత్వాన్ని కాపాడటం దారుణమన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఆయన వైఎస్ కుటుంబాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విజయమ్మ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడిని ప్రజల నుంచి దూరం చేసినా ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ నిర్మాణంలో ఏ మాత్రం వెనకబడకూడదని పిలుపునిచ్చారు
అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ప్రధాన ప్రతిపక్షం నేత చంద్రబాబే ప్రభుత్వాన్ని కాపాడటం దారుణమన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఆయన వైఎస్ కుటుంబాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విజయమ్మ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడిని ప్రజల నుంచి దూరం చేసినా ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ నిర్మాణంలో ఏ మాత్రం వెనకబడకూడదని పిలుపునిచ్చారు
0 comments:
Post a Comment