మినిస్ట్రీస్తో బ్రదర్ అనిల్కు ఏం సంబంధం?
షర్మిల పాదయాత్రకు ప్రజాదరణ చూసి డ్రామాలు
వైఎస్ కుటుంబంపై బురదజల్లే మరో కుట్ర
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార, ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొత్త డ్రామా మొదలుపెట్టాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకర్రావు విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అభిమానిస్తున్న జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై కుట్రలు, కుతంత్రాలు పన్నిన ఆ పార్టీలు ఇప్పుడు కొత్తగా షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్పై ఒక పథకం ప్రకారం నిందారోపణలకు దిగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లాలో మినిస్ట్రీస్కు, బ్రదర్ అనిల్కు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కావాలని ఒక పథకం ప్రకారం అప్రతిష్టపాలు చేయాలని కుట్రపన్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం జూపూడి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ అధీనంలో ఉన్న స్థలాన్ని మినిస్ట్రీస్కు కేటాయించారని, దీనితో ఎలాంటి సంబంధం లేని బ్రదర్ అనిల్కు ముడిపెట్టటమే కాకుండా స్థలం కబ్జా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఖండించారు. షర్మిల తన పాదయాత్రలో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతో మ్యాచ్ఫిక్సింగ్ చేసుకున్న తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతున్నందునే ఆమె భర్తపై ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
షర్మిల పాదయాత్రకు ప్రజాదరణ చూసి డ్రామాలు
వైఎస్ కుటుంబంపై బురదజల్లే మరో కుట్ర
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార, ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొత్త డ్రామా మొదలుపెట్టాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకర్రావు విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అభిమానిస్తున్న జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై కుట్రలు, కుతంత్రాలు పన్నిన ఆ పార్టీలు ఇప్పుడు కొత్తగా షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్పై ఒక పథకం ప్రకారం నిందారోపణలకు దిగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లాలో మినిస్ట్రీస్కు, బ్రదర్ అనిల్కు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కావాలని ఒక పథకం ప్రకారం అప్రతిష్టపాలు చేయాలని కుట్రపన్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం జూపూడి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ అధీనంలో ఉన్న స్థలాన్ని మినిస్ట్రీస్కు కేటాయించారని, దీనితో ఎలాంటి సంబంధం లేని బ్రదర్ అనిల్కు ముడిపెట్టటమే కాకుండా స్థలం కబ్జా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఖండించారు. షర్మిల తన పాదయాత్రలో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతో మ్యాచ్ఫిక్సింగ్ చేసుకున్న తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతున్నందునే ఆమె భర్తపై ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
0 comments:
Post a Comment