జగన్ నినాదాలతో హోరెత్తిన కారంపూడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నినాదాలతో హోరెత్తిన కారంపూడి

జగన్ నినాదాలతో హోరెత్తిన కారంపూడి

Written By news on Tuesday, February 26, 2013 | 2/26/2013

గుంటూరు జిల్లా కారంపూడి జగన్ నినాదాలతో హోరెత్తింది. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం యాత్ర కారంపూడికి చేరుకుంది. వైఎస్ఆర్ అభిమానులతో కారంపూడి జనసంద్రమైంది. నాగులేరు సాక్షిగా జనం పోటెత్తారు.అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అపడం ఎంత కష్టమో.. జగనన్నకూడా అంతే కష్టమన్నారు. త్వరలోనే జగనన్న బయటకు వస్తాడని.. రాజన్న కలలుగన్న రాజ్యాన్ని అందిస్తాడని షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కారంపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. రాజన్న కలలను, మాటలను జగనన్న నిలబెడుతారన్నారు. అప్పటి వరకు జగనన్నను ఆశ్వీరదించి..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని షర్మిల విజ్క్షప్తి చేశారు. 

అంతేకాకుండా గుంటూరు జిల్లా అభివృద్దికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు స్వీకారం చూట్టారని షర్మిల తెలిపారు. ఈ 
ప్రభుత్వానికి రాష్ట్రమంటే చిన్న చూపని, రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టవని, కిరణ్ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి తేడాలేదని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ చేతిలో సీబీఐ ఆయుధంగా మారిందని, చంద్రబాబు తప్పలు సీబీఐకి కనిపించవని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Share this article :

0 comments: