ఇది రైతు పట్టని రాజ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది రైతు పట్టని రాజ్యం

ఇది రైతు పట్టని రాజ్యం

Written By news on Friday, March 1, 2013 | 3/01/2013

ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..మట్టినే నమ్ముకుంటూ...ఆ మట్టి నుంచి ముద్దను సృష్టించి లోకానికి పట్టెడన్నం పెట్టె రైతు... దేశానికి వెన్నెముక. రైతు లేనిదే రాజ్యం లేదని గుర్తించిన నేత... వైఎస్ రాజశేఖరరెడ్డి. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని త్రికరణశుద్ధిగా నమ్మిన మహావ్యక్తి...రాజన్న. కర్షకుల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన తొట్టతొలి నాయకుడు...వైఎస్. 2003 ఏప్రిల్ 9 నుంచి జూన్13 వరకు 1700 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాజశేఖరుడు...అన్నదాతల కష్టాలను అతి దగ్గరగా చూశారు... సీఎంగా పగ్గాలు చేపట్టగనే మాట తప్పక... మడమ తిప్పక... ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేసి రైతులపై వున్న ప్రేమను చాటుకున్నారు. వ్యవసాయంపై వున్న మమకారాన్ని పంచుకున్నారు.

ఆయన కల సాకారమైంది...రైతు రాజయ్యాడు....రాజశేఖరుడు రాజన్న అయ్యాడు. రాజన్న దుర్మరణంతో రైతులకు గతమెంతో ఘనకీర్తిగా మిగిలింది. ఉచితం దేవుడెరుగు అసలు విద్యుత్తే లేకుండా పోయింది. పంటలు పోయాయి. అప్పులు మిగిలాయి. ఆత్మహత్యలు పెరిగాయి. మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ఎదుట రైతన్నలు బోరు మంటున్నారు. రాజన్న పోవడంతోనే తమ బతుకులూ పోయాయంటూ కంటతడిపెడుతున్నారు. జగనన్న వస్తాడు..రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాడు ఓపిక పట్టాలంటూ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు షర్మిల.

 గుంటూరు:‘జగనన్న పాలనలో మహానేత రాజన్న రాజ్యం రానుంది. అప్పుడు రైతే రాజు. విద్యార్థుల పైచదువులకు ఢోకా ఉండదు.వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు, పేదవారికి నెలనెలా రేషన్, పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అప్పటి వరకు ఓపిక పట్టండని’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల కోరారు. ఈ దొంగల రాజ్యం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రోజుకో విధంగా పన్నుల భారాన్ని మోపుతోంది. విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని రైతుల్ని జైలుకు పంపుతోంది. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకుని మీ కోసం పాదయాత్ర అంటూ కాలక్షేపం చేస్తున్నాడని షర్మిల విరుచుకుపడ్డారు.

ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’పాదయాత్ర గురువారం గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ సమీపంలోని బస కేంద్రం నుంచి ప్రారంభమైంది.దారిలో ఆమెను కలిసిన రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులను అడిగి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. శనగ, మొక్కజొన్న పంటలు నీళ్లు అందక ఎండిపోయాయని రైతులు పోట్లచెరువు నాగేశ్వరరావు, మన్నెం సుబ్బయ్యలు వివరించారు. 

జానపాడులో రచ్చబండ...
జానపాడులో జరిగిన రచ్చబండలో రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం వల్ల నాశనమై పోతున్నామన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. . కరెంటు లేకపోవడంతో చదువులు సాగడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ పాలనలో చల్లగా ఉన్నామని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తన భర్తను బతికించుకున్నట్టు దుర్గ అనే అంగన్‌వాడీ కార్యకర్త వివరించారు. మహిళల సమస్యలు ఆసాంతం విన్న షర్మిల జగనన్న వస్తాడు, మీ సమస్యలు తీరుస్తాడు అంటూ భరోసా ఇచ్చారు. ఈ రచ్చబండలో షర్మిలతోపాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కూడా పాల్గొన్నారు. నేరేడు మల్లయ్య అనే వృద్ధుడు గురువారం షర్మిలను కలిసి ఆశీర్వదించాడు. మూడు రోజుల నుంచి ప్రయత్నించడంతో ఈ రోజు షర్మిలమ్మను కలవగలిగానని ఆనందం వ్యక్తం చేశాడు.

విద్యార్థులతో ముఖాముఖి...
మధ్యాహ్నం భోజన విరామం తరువాత పిడుగురాళ్లలోని నవీన విద్యాసంస్థల విద్యార్థులతో షర్మిల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అందడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై షర్మిల మాట్లాడుతూ జగనన్న సీఎం అయిన తరువాత మీ చదువులకు ఢోకా లేకుండా ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం మళ్లీ వస్తుందని హామీ ఇచ్చారు.అక్కడి నుంచి బయలుదేరగా, పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్ వద్ద భారీ ఎత్తున స్వాగతం లభించింది. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ, పిడుగురాళ్లలో తాగునీటి సమస్య పరిష్కారానికి వైఎస్ చేసిన కృషిని గుర్తు చేశారు. 

రూ. 37 కోట్లతో 2006లోనే తాగునీటి పథకం ప్రారంభించి 80 శాతం పూర్తి చేసినా మిగిలిన పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. బొగ్గు, కరెంటు లేక సున్నం పరిశ్రమలు మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. వైఎస్ హయాంలో ఈ నియోజకవర్గంలో రూ.500 కోట్ల విలువైన పనులు జరిగాయన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఈ దొంగల ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. జగనన్న పాలనలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, పంటలకు గిట్టుబాటు కల్పించడంతోపాటు ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలు పెరగకుండా నియంత్రిస్తామని చెప్పారు.

సీఎంకు ముందు చూపులేకే కోతలు..
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కు ముందుచూపు లేకపోవడం వల్ల కరెంటు కోత ఏర్పడిందన్నారు. ఇప్పటి సాగునీటి సమస్యలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కారణమని తెలిపారు. ప్రజల్లో జగనన్నకు పెరుగుతున్న ఆదరణకు భయపడి కేంద్రం సీబీఐతో కేసులు పెట్టించి జైలులో ఉంచిందని, ఆయన ఎక్కడ ఉన్నా పులి పులేనన్నారు. ఉదయించే సూర్యుడిని ఎలా ఆపలేరో జగనన్నను సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. అప్పటి వరకు పార్టీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్,రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత, గుంటూరు, కృష్ణా జిల్లాల కో ఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), జిల్లా పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నాయకులు యెనుముల మురళీధరరెడ్డి, డాక్టర్ నన్నపనేని సుధ, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, బీసీ సెల్ జిల్లా కన్వీనరు దేవెళ్ల రేవతి, ఎస్‌సీ సెల్ కన్వీనరు బండారు సాయిబాబు, నూనె ఉమామహేశ్వరరెడ్డి,అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. 

పోటెత్తిన పిడుగురాళ్ల...
పిడుగురాళ్ల: షర్మిల పాదయూత్ర పిడుగురాళ్ళకు చేరడంతో పట్టణవుంతా జనసంద్రంగా మారింది. రాజన్న బిడ్డను చూసేందుకు, ఆమెకు తవు సవుస్యలను విన్నవించుకునేందుకు పట్టణానికి జనం పోటెత్తారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ కిక్కిరిసి పోయూయి
Share this article :

0 comments: