టీడీపీ నుంచి వలసలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ నుంచి వలసలు

టీడీపీ నుంచి వలసలు

Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013

మాజీమంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మేనల్లుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ నాయకుడు కంచేటి సాయిబాబు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెల్లంకొండలో మరోప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కేంద్ర కార్యనిర్వాక కమిటీ సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే), రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, నియోజకవర్గ నాయకులు నూతలపాటి హనుమయ్య, గుత్తికొండ అంజిరెడ్డి, తదితరులు కంచేటి సాయిబాబును అభినందించారు.

నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని సాయిబాబు ఈ సందర్భంగా షర్మిలకు తెలిపారు. ఆయనతో పాటు పానెం హనిమిరెడ్డి, మేకల హనుమంతరావు, అంకిరెడ్డి, పిల్లకతుపుల రామయ్య, ఆలీషా, ఊటుకూరు ప్రభాకరరెడ్డి, మరియదాసులు, మద్దతుదారులు సుమారు మూడు వేలమంది టీడీపీకి గుడ్‌బై చెప్పి షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. అధికార పార్టీకి టీడీపీ వంత పలుకుతూ ప్రజాసమస్యలను విస్మరించిందని ఈ సందర్భంగా సాయిబాబు చెప్పారు. వైఎస్సార్ సీపీలో చేరడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నడవాడలని నిర్ణయించుకున్నానని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంతోపాటు జిల్లావ్యాప్తంగా పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. సాయిబాబు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 
Share this article :

0 comments: