మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం అనుపాలెంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లు, ఇళ్లు, విద్యుత్ సమస్యలపై గ్రామస్తులు తమ గోడును వెలిబుచ్చారు. షర్మిల మాట్లాడుతూ బాబు హయాంలో రైతులు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేదని, అదే వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులకు అంతా మంచే జరిగిందని అన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ లేక విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న రాజ్యంలో రైతులకు, విద్యార్థులకు మళ్లీ మంచిరోజులు వస్తాయని, విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపవద్దని షర్మిల సూచించారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ లేక విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న రాజ్యంలో రైతులకు, విద్యార్థులకు మళ్లీ మంచిరోజులు వస్తాయని, విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపవద్దని షర్మిల సూచించారు.
0 comments:
Post a Comment