విద్యుత్ సంక్షోభంపై ఏప్రిల్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన చేసింది. నల్గొండలో జరగనున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్లొంటారని తెలిపింది.
విద్యుత్ సమస్యలపై పోరాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ శనివారం విజయవాడలో అన్నారు. రిలయన్స్ సంస్థకు రాష్ట్ర గ్యాస్ నిక్షేపాలు చంద్రబాబు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. అందువల్లే ఈనాడు సంస్థ ప్రతిఫలం పొందిందని తెలిపారు.
చంద్రబాబు తన హయాంలో రాష్ట్రంలో గ్యాస్ ఆథారిటి సంస్థ ఏర్పాటు చేసి ఉంటే కేజీ బేసి న్ లోని చమురు నిక్షేపాలు మనకు వచ్చి ఉండేవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్ర సమస్యలు ఉంటే మంత్రులు పనిలేక విదేశీ పర్యటనలు చేస్తున్నారని సుభాష్ చంద్రబోస్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
విద్యుత్ సమస్యలపై పోరాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ శనివారం విజయవాడలో అన్నారు. రిలయన్స్ సంస్థకు రాష్ట్ర గ్యాస్ నిక్షేపాలు చంద్రబాబు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. అందువల్లే ఈనాడు సంస్థ ప్రతిఫలం పొందిందని తెలిపారు.
చంద్రబాబు తన హయాంలో రాష్ట్రంలో గ్యాస్ ఆథారిటి సంస్థ ఏర్పాటు చేసి ఉంటే కేజీ బేసి న్ లోని చమురు నిక్షేపాలు మనకు వచ్చి ఉండేవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్ర సమస్యలు ఉంటే మంత్రులు పనిలేక విదేశీ పర్యటనలు చేస్తున్నారని సుభాష్ చంద్రబోస్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
0 comments:
Post a Comment