Home »
» అక్రమంగా బెయిల్ను అడ్డుకుంటున్నారు
అక్రమంగా బెయిల్ను అడ్డుకుంటున్నారు
రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్ను ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ఆయన ఏ తప్పూ చేయలేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ప్రభుత్వంలో జరిగిన తప్పులకు జగన్ని ఎందుకు బాధ్యుడిని చేస్తారు? నిజంగా తప్పు జరిగి ఉంటే అప్పటి క్యాబినెట్ బాధ్యత వహించాలి కానీ, దానికి విరుద్ధంగా ఆనాడు ఏ పదవిలోనూ లేని, దేనితోనూ సంబంధం లేని వ్యక్తిని జైల్లో పెట్టడం న్యాయమేనా? పోనీ జగన్ చేసిన తప్పులైనా సీబీఐ ఎత్తి చూపించాలి కదా. ఇంతవరకు చూపించలేదు. జగన్ బయట ఉంటే, ఉప ఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా రావని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కయ్యి చేసిన కుట్ర ఫలితమే జగన్ అరెస్ట్. అయినా జగన్లోనే జనం, జనంలోనే జగన్ ఉన్నారన్న సంగతి ఎన్నికల ఫలితాలు వచ్చాక గానీ కాంగ్రెస్, టీడీపీలు గుర్తించలేకపోయాయి. జగన్ మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఏడాదిన్నర దాటినా సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపించలేదు. భారత రాజ్యాంగం ప్రకారం తొంభై రోజుల తర్వాత బెయిల్ పొందే అవకాశం ఉంది కానీ బెయిల్ రానివ్వకుండా చేసి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తోంది ఈ ప్రభుత్వం. ఏది ఏమైనా పేదల ఆపద్బాంధవుడు, ప్రజల పక్షపాతి జగన్ బయటికి వచ్చితీరుతారు. 2014లో ఈ ప్రభుత్వానికి, ఈ ప్రతిపక్షానికి తగిన గుణపాఠం చెబుతారు. - ఎం.డి.గౌస్, ఆత్మకూరు, మహబూబ్నగర్
|
|
0 comments:
Post a Comment