Home »
» రైతులపై కక్షకట్టిన సర్కార్: ఇంద్రకరణ్రెడ్డి
రైతులపై కక్షకట్టిన సర్కార్: ఇంద్రకరణ్రెడ్డి
రాష్ర్టంలో రైతులపై కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం కక్షకట్టిందని, వారి సంక్షేమాన్ని విస్మరించిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ, రైతులకు పంట నష్టపరి హారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఆర్డీవో కార్యాల యం ఎదుట 48 గంటల దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన స్వగృహం నుంచి పట్టణంలో భారీ బైక్ర్యాలీ నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, దీక్ష ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ కరెంటు చార్జీలు పెంచి ప్రభుత్వం పేదల నడ్డి విరించిందని, విద్యుత్ కోతలతో రాష్ర్టంలో అంధకారం అలుముకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీక్షకు మద్దతు తెలిపిన కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ జనక్ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, కోనేరు కోనప్ప తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు.
|
|
0 comments:
Post a Comment