కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 23న సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. న్యాయమూర్తులు జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ ఎం.వై.ఇక్బాల్లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన విధంగా తుది చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ కోసం జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ గురించి ఆయన తరఫు న్యాయవాదులు ఈ నెల 17న ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దాంతో జగన్ పిటిషన్ను నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్తో జత చేయాల్సిందిగా రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. దాంతో జగన్ బెయిల్ పిటిషన్ను ప్రసాద్ పిటిషన్తో రిజిస్ట్రీ జత చేసింది. రెండు పిటిషన్లను ధర్మాసనం ఈ నెల 23న విచారించనున్నది.
Home »
» జగన్ బెయిల్ పిటిషన్పై 23న సుప్రీంలో విచారణ
జగన్ బెయిల్ పిటిషన్పై 23న సుప్రీంలో విచారణ
Written By news on Sunday, April 21, 2013 | 4/21/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment