చంద్రబాబు పాలనలో అన్నదాతలు అష్టకష్టాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు పాలనలో అన్నదాతలు అష్టకష్టాలు

చంద్రబాబు పాలనలో అన్నదాతలు అష్టకష్టాలు

Written By news on Sunday, February 17, 2013 | 2/17/2013

నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ పనులను కిరణ్ సర్కార్ పట్టించుకోవడం లేదని షర్మిల విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మిర్యాల గూడ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. నల్గొండ ప్రజలకు కనీసం తాగునీరు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు అని అన్నారు. చంద్రబాబు హయాంలో సాగర్ ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ హయంలోనే రైతులు న్యాయం జరిగిందని షర్మిల అన్నారు. అన్నదాతల వెతలను తీర్చే మనసు కిరణ్‌ సర్కార్‌కు లేదని షర్మిల మండిపడ్డారు. వైఎస్ హయాంలో కరెంట్ ఛార్జీలు పెరగలేదని తెలిపారు. 

చంద్రబాబు పాలన.. రాష్ట్రానికి చీకటి పాలన అని, సాగునీటి ప్రాజెక్ట్‌లను చంద్రబాబు విస్మరించారని, చంద్రబాబు అధికారంలో ఉండగా వ్యవసాయం దండగ అన్నారని షర్మిల తెలిపారు. చంద్రబాబు పాలనలో అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారని.. ఇప్పుడు రైతుల కోసం చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని షర్మిల ఆరోపించారు. జగనన్న సీఎం అయిన తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గుతాయని రైతులకు షర్మిల భరోసా ఇచ్చారు. 
Share this article :

0 comments: