గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం జరిగే వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సదస్సులో పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు రాజకీయ నిర్దేశం చేయనున్నారు. సోమవారం గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చిలకలూరిపేటలో నన్నపనేని వెంకటరత్నం కల్యాణమండపంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు జరగనుంది. ఈ సదస్సులో వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నాయకులు హాజరు కానున్నారు. విజయమ్మ సోమవారం ఉదయం 8.30 గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేటకు చేరుకుంటారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి పలువురు నేతలు వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. సదస్సుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పార్టీ జిల్లా కన్వీనరు మర్రి రాజశేఖర్ తెలిపారు.
Home »
» నేడు చిలకలూరిపేటకు వైఎస్ విజయమ్మ
నేడు చిలకలూరిపేటకు వైఎస్ విజయమ్మ
Written By news on Monday, June 24, 2013 | 6/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment