తీర్థయాత్రల కోసం వెళ్లి వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని మానవీయకోణంలో ఆదుకోవాల్సిందిపోయి కాంగ్రెస్, టీడీపీ నేతలు బురద రాజకీయాలు చేయటం సిగ్గుచేటు. రెండు పార్టీల ఎంపీలు వీధి నాయకుల్లా ఒకరినొకరు తోసుకొని వారి నైజాన్ని బయటపెట్టుకున్నారు. వెన్నుపోటు రాజకీయాలతో దేశవ్యాప్తంగా తెలుగువారిని కించపరిచేలా చేసిన చంద్రబాబు ఆఖరికి మానవీయ కోణాన్నీ కించపరిచారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి ఢిల్లీలో సోనియాగాంధీ కాళ్లు మొక్కుతూ తెలుగువారిని అవమానపరిస్తే, వారి ఎంపీలు మరొక అడుగు ముందుకేసి బాహాబాహికి దిగి తెలుగువారి పరువును మరింత పలుచన చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతల వాలకం చూస్తుంటే శవాలపై పేలాలు ఏరుకునేవిధంగా కనబడుతోంది.
- గట్టు రామచంద్రరావు (వైఎస్సార్సీపీ)
0 comments:
Post a Comment