Home »
» నేడు జెనీవా సదస్సుకు జూపూడి
నేడు జెనీవా సదస్సుకు జూపూడి
సాక్షి, హైదరాబాద్: ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న గ్లోబల్ హోప్ నెట్వర్క్ ఇంటర్ నేషనల్ వార్షిక సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావుకు ఆహ్వానం అందింది. జెనీవాలో ఈ నెల 29 నుంచి వారం రోజులు జరగనున్న ఈ సమావేశాల్లో ‘సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఖెయాటిక్ టైమ్స్-గ్లోబల్ చాలెంజెస్ అండ్ లోకల్ సొల్యూషన్స్’ అనే అంశంపై జూపూడి ప్రసంగించనున్నారు. ఆయన శుక్రవారం జెనీవాకు బయల్దేరతారు. 65 దేశాల ప్రతినిధులు పాల్గొనబోయే ఈ సదస్సుకు వరుసగా రెండో సంవత్సరం కూడా జూపూడికి ఆహ్వానం అందడం గమనార్హం. గత ఏడాది ‘సంఘర్షణతోనే నాయకత్వ సృష్టి’ అనే అంశంపై జెనీవాలో జూపూడి ప్రసంగించారు.
|
|
0 comments:
Post a Comment