ఖమ్మం: ఎన్ ఎస్ సీ క్యాంప్ లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు వసతి గృహంలోని సౌకర్యాలలేమీని విద్యార్థులు విన్నవించారు. హాస్టల్ లో నెలకొన్న సౌకర్యాలలేమీపై వైఎస్ విజయమ్మ వార్డెన్ ను ప్రశ్నించారు. అనంతరం విద్యార్థినీలకు నోట్పుస్తకాలను వైఎస్ విజయమ్మ పంపిణి చేశారు. నల్గొండ జిల్లాలోని కోదాడాలో బుధవారం వైఎస్ విజయమ్మ అధ్యక్షతన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం అమె ఖమ్మం జిల్లాకు పర్యటనకు వెళ్లారు.
Home »
» సాంఘిక సంక్షేమ హాస్టల్లో విజయమ్మ తనిఖీ
సాంఘిక సంక్షేమ హాస్టల్లో విజయమ్మ తనిఖీ
Written By news on Thursday, June 27, 2013 | 6/27/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment