రవి పర్యటన దింపుడు కళ్లెం ఆశే!: గట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రవి పర్యటన దింపుడు కళ్లెం ఆశే!: గట్టు

రవి పర్యటన దింపుడు కళ్లెం ఆశే!: గట్టు

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు చికిత్స చేసినా బతికే పరిస్థితి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతినిధిగా ఇక్కడకు వచ్చిన కేంద్ర మంత్రి వాయలార్ రవి పర్యటన దింపుడు కళ్లెం ఆశ మాత్రమేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది అసలు కాంగ్రెస్ కాదని, పిఆర్ పి కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని తెలిపారు. వైఎస్ జగన్మోహన రెడ్డి ఏరోజైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారో ఆ రోజే కాంగ్రెస్ ఖాళీ అయ్యిందన్నారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక వెలుగు తెచ్చింది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు. ఆయన రెక్కల కష్టంతో అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ప్రజలను, రాజశేఖర రెడ్డిని, ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుందన్నారు. జగన్ ని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. పొమ్మనకుండా పొగబెట్టారు. జగన్మోహన రెడ్డిని బయటకు పోగొట్టుకున్న రోజునే కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పారు. అసలు తప్పు చేసింది ఢిల్లీ వారే అన్నారు. అసలు జబ్బు ఢిల్లీలోనే ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బాగుపడటానికి ఢిల్లీలోనే మందు వేయాలన్నారు. ముఖ్యమంత్రి పదవి ఎలా కాపాడుకోవాలా? అని కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో తిరుగుతున్నారు. పిసిసి పదవి ఎలా కాపాడుకోవాలా? అని బొత్స సత్యనారాయణ ఇక్కడ వాయలార్ రవి వెంట తిరుగుతున్నారు.
Share this article :

0 comments: