Home »
» డబ్బుతో రాజకీయాలు బాబు నైజం: శోభ
డబ్బుతో రాజకీయాలు బాబు నైజం: శోభ
ఆళ్లగడ్డ (కర్నూలు), న్యూస్లైన్: డబ్బుతో రాజకీయాలు చేయడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకే చెల్లుతుందని ఆళ్లగడ్డ తాజా మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. రుద్రవరం మండలం కొండమాయపల్లెలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో డబ్బు సంస్కృతి ఘనత బాబుదేనన్నారు. డబ్బు కోసమే ఎమ్మెల్యేలు జగన్వైపు వెళ్లారని బాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. అధికార పార్టీని వదిలి ఇతర పార్టీల్లోకి ఎమ్మెల్యేలు వలస వెళ్లి ఎన్నికలకు సిద్ధపడిన ఘటనలు దేశంలో ఎక్కడా ఉండవన్నారు.
వైఎస్ఆర్ పథకాల అమలుకు, జగన్పై అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలను సహించలేకే జగన్వెంట ఉన్నామని చెప్పారు. బాబుకు అభిమానం, దయాదాక్షిణ్యాలు లేవన్నారు. టీడీపీలో 90 మంది ఎంఎల్ఏలు ఉండగా పలువురు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారన్నారు. తన పార్టీలోని ఎంఎల్ఏల్లో ఐదుగురిని బాబు తన కోసం రాజీనామా చేయించి గెలిపించుకోవాలని శోభ సవాల్ విసిరారు. |
|
0 comments:
Post a Comment