దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని దళిత ద్రోహి అనడం సరికాదని మాజీ మంత్రి శంకర రావు అన్నారు. అలా మాట్లాడిన నేతలను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతినిధిగా ఇక్కడకు వచ్చిన కేంద్ర మంత్రి వాయలార్ రవి మందలించాలన్నారు. 26 జీఓలకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రస్థావించిన ఆరుగురు మంత్రులను మంత్రి మండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా
గెలవదన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ముఖ్యమంత్రిని మార్చమని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, శాసనసభ స్పీకర్ వంటి పదవులన్నీ సీమాంధ్రులకే ఉండటంతో తెలంగాణ సెంటిమెంట్ మరింత తీవ్రమవుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment