మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రొగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం బయలుదేరి రేవేంద్రపాడు, పెదవడ్లపూడి మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం ఆత్మకూరు, గణపతినగర్, ద్వారకానగర్, వడ్లపూడి సెంటర్, మిద్దెసెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం కొత్తపేట మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
మంగళగిరి నియోజకవర్గం: రేవేంద్రపాడు, పెదవడ్లపూడి,
ఆత్మకూరు, గణపతినగర్, ద్వారకానగర్, వడ్లపూడి సెంటర్,
మిద్దె సెంటర్, ఆర్టీసీ బస్టాండు, కొత్తపేట
పర్యటించే ప్రాంతాలు
మంగళగిరి నియోజకవర్గం: రేవేంద్రపాడు, పెదవడ్లపూడి,
ఆత్మకూరు, గణపతినగర్, ద్వారకానగర్, వడ్లపూడి సెంటర్,
మిద్దె సెంటర్, ఆర్టీసీ బస్టాండు, కొత్తపేట
0 comments:
Post a Comment