వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రపంచ రాజకీయ యవనికలోనే ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని అధోగతిపాల్జేస్తున్న కిరణ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు బాధ్యతా రాహిత్యానికి నిరసనగా చేపట్టిన ఈ యాత్ర ఓ ప్రపంచ రికార్డు అని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలను, అన్న లక్ష్యాలను పుణికిపుచ్చుకొని మహిళగా షర్మిల చేపట్టిన పాదయాత్ర ప్రపంచ రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టిస్తోందన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో షర్మిల మరోప్రజాప్రస్థానం ఆదివారం 100వ రోజుకు చేరుకుంటోందని తెలిపారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షర్మిల ఇప్పటిదాకా మూడు కార్పొరేషన్లు, 43 మున్సిపాలిటీలు, వంద పల్లెల గుండా 1,374 కిలోమీటర్లు పూర్తి చేశారని వివరించారు.
Home »
» రాజకీయాల్లో చారిత్రక ఘట్టం:భూమన
రాజకీయాల్లో చారిత్రక ఘట్టం:భూమన
Written By news on Sunday, March 24, 2013 | 3/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment