Home »
» 'నడుస్తుంది చంద్రబాబు పాలన పార్ట్-2'
'నడుస్తుంది చంద్రబాబు పాలన పార్ట్-2'
హనుమాన్ జంక్షన్: ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తుంది చంద్రబాబు పాలన పార్ట్-2 అని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల అభివర్ణించారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర బుధవారం ఉదయం అరుగొలను చేరుకుంది. ఈ సందర్భంగా ఆ గ్రామ మహిళలతో షర్మిల రచ్చబండను నిర్వహించారు. గ్రామంలో తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాగే వైఎస్ఆర్ మరణం తరువాత గ్రామంలో ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు కాలేదని ఈ సందర్భంగా షర్మిల ఎదుట గ్రామస్థులు సమస్యలను ఎకరువు పెట్టారు.
జగనన్న సీఎం అయ్యాక రాజన్న పాలన తెస్తారని ఆమె గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని, రైతులకు మహిళలకు వడ్డి లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలను లక్షాధికారులు చేయాలని వైఎస్ఆర్ పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం తూట్టు పోడిచిందని అన్నారు. వైఎస్ఆర్ మంచి మనస్సుతో పాలించారని అందువల్లే రాష్టంలో సకాలంలో వర్షాలు కురిశాయని షర్మిల తెలిపారు.
గతంలో బాబు పాలనలో వలసలు, ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లాడిపోయిందని షర్మిల ఆరోపించారు. చంద్రబాబుది దుర్మార్గమైన పాలన అని ఆమె పేర్కొన్నారు. అందుకే అప్పడు దేవుడు కూడా కరుణించలేదని అందుకే వర్షలు కురవలేదని తెలిపారు. ఇప్పడు ప్రజలకు మళ్లీ అవే కష్టాలు వచ్చాయన్నారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యవసరాల ధరలు ఆకాశానంటాయని షర్మిల ఈ సందర్భంగా పేర్కొన్నారు.
|
|
0 comments:
Post a Comment