నెల్లూరు: మహానేత వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డిపై అనుచితవ్యాఖ్యలు చేసిన మంత్రి రాంనారాయణరెడ్డిపై వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కాకాని గోవర్దన్రెడ్డి మండిపడ్డారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతోనే రాజకీయంగా ఎదిగిన ఆనం ఆయనపై వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆరేనని.. అటువంటి మహానేతపై వ్యాఖ్యలు చేయడం ఆనం మంచిది కాదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఆనంను ప్రజలు రాజకీయంగా ఉరితీస్తారని, తన మంత్రి పదవి కాపాడుకోవడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కాకాని గోవర్దన్రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: మహానేత వైఎస్ పై మంత్రి ఆనం అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టింది. జూబ్లీహిల్స్లో వంగపండు ఉషా ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైఎస్ కుటుంబంపై ఆనం అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టిన ఉషాను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుందన్బాగ్లో మంత్రి ఆనం నివాసం ధర్నా చేపట్టిన విజయారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: మహానేత వైఎస్ పై మంత్రి ఆనం అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టింది. జూబ్లీహిల్స్లో వంగపండు ఉషా ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైఎస్ కుటుంబంపై ఆనం అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టిన ఉషాను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుందన్బాగ్లో మంత్రి ఆనం నివాసం ధర్నా చేపట్టిన విజయారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
0 comments:
Post a Comment