‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Friday, June 14, 2013 | 6/14/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో శుక్రవారం (179వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి గురువా రం ప్రకటించారు. కాకినాడ కల్పనా సెంటర్ నుంచి శుక్ర వారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 4.9 కిలో మీటర్ల నడక అనంతరం కాకినాడ బోట్‌క్లబ్ సమీపంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 6.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. తిమ్మాపురం వద్ద రాత్రి బస చేస్తారు. శుక్రవారం మొత్తం 11.2 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.

పర్యటించే ప్రాంతాలు : కాకినాడ వైఎస్సార్ బ్రిడ్జి సెంటర్, భానుగుడి సెంటర్, జేఎన్‌టీయూ, బోట్‌క్లబ్, సర్పవరం జంక్షన్, ఏపీఎస్పీ, అచ్చంపేట జంక్షన్, తిమ్మాపురం
Share this article :

0 comments: