http://andhrabhoomi.net/content/vijayamma-4
స్థానిక సంస్ధల ఎన్నికల నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రతినిధులతో శుక్రవారం తిరుపతి పిఎల్ఆల్ కనె్వన్షన్హాల్లో నిర్వహించిన సదస్సు సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సదస్సు సందర్భంగా పార్టీ గౌరవాధ్యక్షుడు వైఎస్ విజయమ్మ వైఎస్ మరణం నుండి ప్రతి అంశాన్ని ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తూ సుమారు గంటకుపైగా అరళంగా ప్రసంగించి క్యాడర్లో జోష్ నింపారు. రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ విజయమ్మ దిగినప్పటి నుండి తిరుపతి బయలుదేరే వరకూ ఆమె వెంట క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొన్నది. రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా పద్మావతిపురంలోని తిరుపతి ఎమ్మెల్యే, ఆపార్టీ కేంద్ర కమిటి సభ్యులు భూమన్ కరుణాకర్రెడ్డి నివాసానికి వెళ్లిన విజయమ్మ అక్కడ అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు పిఎల్ఆర్ కనెక్షన్హాలుకు చేరుకున్నది. సుమారు 10 వేల మందికిపైగా ప్రతినిదులు పాల్గొన్న ఈ సభలో విజయమ్మకు ఘన స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఆమె సదస్సును ప్రారంభించారు. రాయలసీమ కో- ఆర్డినేటర్ భూమానాగిరెడ్డి పర్యవేక్షణలో భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో ఉద్వేగానికి లోనైన అనేకమంది కార్యకర్తలు వైఎస్ఆర్ అమర్హ్రే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ న్యాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్రెడ్డి, భూమానాగిరెడ్డి, కరుణాకర్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, రైల్వే కోడూరు మాజి ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాయచోట మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్కుమార్రెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్నాధ్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డిలు ప్రసంగిస్తూ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపైనా వుందని, లేని ఫక్షంలో రాష్ట్రంలోని పేద ప్రజానీకం కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని నొక్కివక్కాణించారు. జూపూడి ప్రసంగిస్తున్నంత సమయం సభలో నిశబ్ధవాతావరణం నెలకొన్నది. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ ఒక చరిత్రకారుడని ఆయన పాలన ఒక్క జగన్ వల్లే సాధ్యమంటూ క్యాడర్లో జోస్ నింపాడు. ఇక తిరుపతికి చెందిన ఎస్కెబాబు, హనుమంతనాయక్, అనంతపురంకు చెందిన ఉష, పీలేరుకు చెందిన మదుసూదన్రెడ్డి తదితరులు ప్రసంగించారు. రాయచోటికి చెందిన నిషార్ అనే వ్యక్తి మాట్లాడుతూ రాయచోటిలో ఓటు అంటే ఏమిటో తెలియని వారందరికి 1984లోనే ఓట్లు రాయించి ధైర్యంగా ఓట్లు వేయించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి అన్నారు. వైఎస్ స్టైల్లో చేతులు ఊపుతూ ఆయనకు చేసిన అభివృద్దిని కొనియాడుతూ రాజన్న రాజ్యం కోసం తమ ప్రాణాలైనా ఇస్తామంటూ సభికులను ఉత్సాహపరిచారు
స్థానిక సంస్ధల ఎన్నికల నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రతినిధులతో శుక్రవారం తిరుపతి పిఎల్ఆల్ కనె్వన్షన్హాల్లో నిర్వహించిన సదస్సు సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సదస్సు సందర్భంగా పార్టీ గౌరవాధ్యక్షుడు వైఎస్ విజయమ్మ వైఎస్ మరణం నుండి ప్రతి అంశాన్ని ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తూ సుమారు గంటకుపైగా అరళంగా ప్రసంగించి క్యాడర్లో జోష్ నింపారు. రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ విజయమ్మ దిగినప్పటి నుండి తిరుపతి బయలుదేరే వరకూ ఆమె వెంట క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొన్నది. రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా పద్మావతిపురంలోని తిరుపతి ఎమ్మెల్యే, ఆపార్టీ కేంద్ర కమిటి సభ్యులు భూమన్ కరుణాకర్రెడ్డి నివాసానికి వెళ్లిన విజయమ్మ అక్కడ అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు పిఎల్ఆర్ కనెక్షన్హాలుకు చేరుకున్నది. సుమారు 10 వేల మందికిపైగా ప్రతినిదులు పాల్గొన్న ఈ సభలో విజయమ్మకు ఘన స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఆమె సదస్సును ప్రారంభించారు. రాయలసీమ కో- ఆర్డినేటర్ భూమానాగిరెడ్డి పర్యవేక్షణలో భూమన కరుణాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో ఉద్వేగానికి లోనైన అనేకమంది కార్యకర్తలు వైఎస్ఆర్ అమర్హ్రే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ న్యాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్రెడ్డి, భూమానాగిరెడ్డి, కరుణాకర్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, రైల్వే కోడూరు మాజి ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాయచోట మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్కుమార్రెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్నాధ్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డిలు ప్రసంగిస్తూ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపైనా వుందని, లేని ఫక్షంలో రాష్ట్రంలోని పేద ప్రజానీకం కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని నొక్కివక్కాణించారు. జూపూడి ప్రసంగిస్తున్నంత సమయం సభలో నిశబ్ధవాతావరణం నెలకొన్నది. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ ఒక చరిత్రకారుడని ఆయన పాలన ఒక్క జగన్ వల్లే సాధ్యమంటూ క్యాడర్లో జోస్ నింపాడు. ఇక తిరుపతికి చెందిన ఎస్కెబాబు, హనుమంతనాయక్, అనంతపురంకు చెందిన ఉష, పీలేరుకు చెందిన మదుసూదన్రెడ్డి తదితరులు ప్రసంగించారు. రాయచోటికి చెందిన నిషార్ అనే వ్యక్తి మాట్లాడుతూ రాయచోటిలో ఓటు అంటే ఏమిటో తెలియని వారందరికి 1984లోనే ఓట్లు రాయించి ధైర్యంగా ఓట్లు వేయించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి అన్నారు. వైఎస్ స్టైల్లో చేతులు ఊపుతూ ఆయనకు చేసిన అభివృద్దిని కొనియాడుతూ రాజన్న రాజ్యం కోసం తమ ప్రాణాలైనా ఇస్తామంటూ సభికులను ఉత్సాహపరిచారు
0 comments:
Post a Comment