విమానాశ్రయంలో విజయమ్మకు ఘన స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విమానాశ్రయంలో విజయమ్మకు ఘన స్వాగతం

విమానాశ్రయంలో విజయమ్మకు ఘన స్వాగతం

Written By news on Friday, June 14, 2013 | 6/14/2013

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. విజయమ్మ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి ర్యాలీగా బయల్దేరారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాయలసీమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో విజయమ్మ నేడు తిరుపతిలో సమావేశమవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో పార్టీ నేతలతో మాట్లాడతారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో విజయమ్మ తిరుపతి నుంచి రోడ్డుమార్గం ద్వారా చిత్తూరుకు చేరుకుంటారు.


9 గంటలకు ఏఐఆర్ బైపాస్ రోడ్డులోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ కేంద్రం వైఎస్‌ఆర్ ప్రాంగణానికి వస్తారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఐదు జిల్లాల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటల తరువాత చిత్తూరు మీదుగా ఆమె బెంగళూరు వెళుతారు. సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పార్టీ రాయలసీమ జిల్లాల కన్వీనర్ భూమా నాగిరెడ్డి తిరుపతికి చేరుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకుడు మిథున్‌రెడ్డితో కలసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, ఐదు జిల్లాలకు చెందిన నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షానికి ప్రభుత్వం కొమ్ముకాస్తోందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఈ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, తిరుపతి నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి తదితరులు వీరితోపాటు ఉన్నారు.
Share this article :

0 comments: