ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూ వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్ను ప్రధాన మంత్రి కార్యాలయం తిరస్కరించింది. వాద్రాకు సంబంధించి వివరాలు అత్యంత రహస్యమని పేర్కొంది. ఆ వివరాలను బహిర్గతం చేయడం కుదరదని ఆర్టీఐ పిటిషన్ను తోసిపుచ్చింది.
గత కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై వివరాలు కావాలంటూ అడిగితే, ఇది న్యాయస్థానం పరిధిలోని అంశం అని సమాచారం ఇవ్వకుండా పీఎంఓ అధికారులు తప్పించుకున్నారు. సోనియా గాంధీ అల్లుడైన వాద్రాకు పలు వ్యాపారాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఆయన ఉచితంగా భూములను పొందారు. గత ఏడాది డీఎల్ఎఫ్- వాద్రాల మధ్య భూ అక్రమాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బహిర్గతం చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
గత కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై వివరాలు కావాలంటూ అడిగితే, ఇది న్యాయస్థానం పరిధిలోని అంశం అని సమాచారం ఇవ్వకుండా పీఎంఓ అధికారులు తప్పించుకున్నారు. సోనియా గాంధీ అల్లుడైన వాద్రాకు పలు వ్యాపారాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఆయన ఉచితంగా భూములను పొందారు. గత ఏడాది డీఎల్ఎఫ్- వాద్రాల మధ్య భూ అక్రమాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బహిర్గతం చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment