వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో సోమవారం (182వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆదివారం ప్రకటించారు. సామర్లకోట నుంచి సోమవారం ఉదయం షర్మిల పాద యాత్ర ప్రారంభిస్తారు. 6.1 కిలోమీటర్ల నడక అనంతరం పెద్దాపురం మరిడమ్మ సెంటర్ సమీపంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 8.5 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. పులిమేరులో రాత్రి బస చేస్తారు. సోమవారం మొత్తం 14.6 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు
పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్, దర్గాసెంటర్, మరిడమ్మ ఆలయం సెంటర్, ఆర్.టి.సి. కాంప్లెక్స్, జి. రాగంపేట, వడ్లమూరు, గోరింట, పులిమేరు
పర్యటించే ప్రాంతాలు
పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్, దర్గాసెంటర్, మరిడమ్మ ఆలయం సెంటర్, ఆర్.టి.సి. కాంప్లెక్స్, జి. రాగంపేట, వడ్లమూరు, గోరింట, పులిమేరు
0 comments:
Post a Comment