Home »
» జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ దీక్ష -నేడు ఢిల్లీకి వికలాంగుల యాత్ర
జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ దీక్ష -నేడు ఢిల్లీకి వికలాంగుల యాత్ర
పెనుకొండ, న్యూస్లైన్: వైఎస్సార్ సీపీ అధినేత, కడప ఎంపీ జగన్ మోహన్రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా పెనుకొండలో గురువారం వికలాంగులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు షరీఫ్ నేతృత్వంలో ఉదయం పట్టణంలోని దర్గా సర్కిల్కు చేరుకున్న వికలాంగులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్ష ప్రారంభించారు. శుక్రవారం పెనుకొండ నుంచి ఢిల్లీకి వికలాంగులు ట్రైసైకిళ్లపై ర్యాలీగా బయలుదేరి వెళతారు.
0 comments:
Post a Comment