గల్ఫ్లో చిక్కుకుపోయిన రాష్ట్రవాసులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో పాటు ఆయా దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వెళ్లిన కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్య వైఖరి విడనాడాలని కోరింది. పార్టీ ఎమ్మెల్యేలు ఏ.అమరనాథరెడ్డి, కె.శ్రీనివాసులు బుధవారం అసెంబ్లీ మీడియాపాయింట్లో మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల అనేకమంది కార్మికులు విదేశాల బాట పట్టారని, అయితే గల్ఫ్ దేశాల చట్టాల్లో మార్పుల వల్ల వారు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Home »
» గల్ఫ్ బాధితులను ఆదుకోవాలి: వైఎస్ఆర్సీపీ
గల్ఫ్ బాధితులను ఆదుకోవాలి: వైఎస్ఆర్సీపీ
Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment