ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేదిలేదని వైఎస్ఆర్ సిపి నాయకురాలు కొండా సురేఖ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. కొందరు పనిగట్టుకుని పార్టీపై దుష్పచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న మంత్రులను తొలగించకుంటే ప్రభుత్వానికే నష్టం అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా జరగలేదని చెప్పారు. రిజర్వేషన్ల ప్రక్రియలో పూర్తిగా అవకతవకలున్నాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందెందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.
పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా జరగలేదని చెప్పారు. రిజర్వేషన్ల ప్రక్రియలో పూర్తిగా అవకతవకలున్నాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందెందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.
0 comments:
Post a Comment