విజయవాడ: ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లి వరదల్లో జాడ తెలియకుండా పోయిన వారి కుటుంబాలను శనివారం ఉదయం వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించి ధైర్యం చెప్పారు. స్థానిక బావాజీపేట నుంచి 14 మంది చార్ధామ్ యాత్రకు వెళ్లారు. వారిలో నలుగురు ప్రస్తుతం ఢిల్లీ చేరుకోగా, మరో మహిళ ఢిల్లీ నుంచి నగరానికి బయలుదేరారు. మిగిలిన తొమ్మిది మంది ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎనికేపాడులో ఏర్పాటు చేసిన పార్టీ ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన విజయమ్మ తొలుత బాధితుల ఇళ్లకు వెళ్లి అరగంటకు పైగా గడిపారు.
ధైర్యంగా ఉండాలని, తమ పార్టీ ఆదుకుంటుందని బాధితుల కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్ విజయమ్మ విలేకరులతో మాట్లాడుతూ బాధితుల విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించడం లేదని విమర్శించారు. ఈ విషయంలో ఇప్పటికే తాము ప్రభుత్వానికి లేఖ రాశామని, బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అండగా ఉంటుందని, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. విజయమ్మతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం కన్వీనర్ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి పి.గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. |
Home »
» బాధిత కుటుంబాలకు విజయమ్మ మనోధైర్యం
బాధిత కుటుంబాలకు విజయమ్మ మనోధైర్యం
Written By news on Sunday, June 23, 2013 | 6/23/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment