జగన్ ఏమి తప్పు చేశాడని ఇంతలా మాట్లాడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఏనాడైనా సచివాలయంలో కనిపించారా?మంత్రులతో మాట్లాడారా?అసలు హైదరాబాద్ లో ఉన్నారా?బెంగళూరులో వ్యాపారం చేసుకున్నారని, అలాంటి వ్యక్తి మీద ఇలా నిందలు మోపుతారా అని ఆమె ప్రశ్నించారు.మంత్రులు తమను కళంకితులు అంటారా అని బాదపడుతున్నారని,మరి అలాంటప్పుడు జగన్ ను ఇన్ని మాటలు అంటుంటే తాము ఎంత బాధపడుతున్నానమి అన్నారు. పులివెందులలో ఒక ఇల్లు ఉంటే తప్పా?బెంగళూరులో వ్యాపారం చేసుకుంటే ఇల్లు ఉంటే తప్పా అని ఆమె అన్నారు.మా ఇంటిలో మూడు బెడ్ రూమ్ లు, జగన్ ఇంటిలో నాలుగు బెడ్ రూమ్ లు,షర్మిల ఇంటికి నాలుగు బెడ్ రూమ్ లు ఉన్నాయని, అంతకుమించి ఎక్కడ ఉన్నాయని విజయమ్మ ప్రశ్నించారు.డెబ్బై బెడ్ రూమ్ లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని, అన్ని బెడ్ రూమ్ లు ఎందుకు ఉంటాయి.హోటల్ నడపాలంటేనే అన్ని రూమ్ లు ఉండాలని ఆమె అన్నారు.తాను అసలు రాజకీయాలలోకి రావాలని అనుకోలేదని ఆమె అన్నారు.నా బొట్టు గురించి, నేను బైబిల్ పట్టుకోవడంపైన,అలాగే జగన్ ,షర్మిలపైన ఎన్నో మాట్లాడుతున్నారని, చివరికి మా మనవళ్లను వదలిలేలా లేరని ,ఇంత నీచ రాజకీయాలు చే్స్తున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.తాను ధైర్యం కోసమే బెబిల్ పట్టుకుంటున్నానని ఆమె అన్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20130622_10.php
0 comments:
Post a Comment