అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ

అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్ సీపీ

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. 18 మంది సంతకాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నోటీసు ఇచ్చింది. మరోవైపు టీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్కు అందచేసింది. టీఆర్ఎస్ పార్టీ తీర్మానానికి సీపీఐ, బీజేపీ, నాగంలు మద్ధతు తెలిపారు. 

మొత్తం 25 మంది ఎమ్మెల్యేల సంతకాలతో టీఆర్ఎస్ అవిశ్వాసం నోటీసు ఇచ్చింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ఇంతకముందే టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లు ప్రకటించాయి. ప్రభుత్వం అన్ని రంగాల్లో తీవ్రంగా విఫలమైందని ఆ పార్టీలు ఆరోపించాయి. అయితే అవిశ్వాసానికి తాము మద్ధతు ఇవ్వబోమని టీడీపీ ప్రకటించింది.
Share this article :

0 comments: