అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఈటెల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఈటెల

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఈటెల

Written By news on Friday, March 15, 2013 | 3/15/2013

రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. టీఆర్ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, లోక్ సత్తా, వామపక్ష నేతలు, నాగం జనార్ధనరెడ్డి లేచి నిలబడ్డారు. 

తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్యను స్పీకర్ లెక్కించారు. 45మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. సంఖ్యాబలం ఉండటంతో అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి ఇచ్చారు. అనంతరం సభలో గందరగోళం నెలకొనటంతో అసెంబ్లీ అరగంట పాటు వాయిదా పడింది. కాగా టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలు సక్రమంగా ఉన్నాయని అంతకు ముందు స్పీకర్ ప్రకటించారు.
Share this article :

0 comments: