రాష్ట్రాన్ని దోచుకున్నవారు దొరల్లా దర్జాగా బయట తిరుగుతున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రాన్ని దోచుకున్నవారు దొరల్లా దర్జాగా బయట తిరుగుతున్నారు

రాష్ట్రాన్ని దోచుకున్నవారు దొరల్లా దర్జాగా బయట తిరుగుతున్నారు

Written By ysrcongress on Friday, March 15, 2013 | 3/15/2013


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను మాజీమంత్రి, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పెద్దిరెడ్డితోపాటు ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘మా జిల్లా (చిత్తూరు)కే చెందిన సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ, తాజాగా జరిగిన సహకార ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేశారు. అంత దురదృష్టంలో కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది. అదే పార్టీలో ఉంటే మాకు కూడా అపవాదు వస్తుంది. రెండు పార్టీలూ కలిసి కుట్రలు, కుతంత్రాలతో ఎలాంటి తప్పు చేయని జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకున్నవారు దొరల్లా దర్జాగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పూ చేయని జగన్‌ను పది నెలలుగా అన్యాయంగా జైల్లో నిర్బంధించారు. ఇలాంటి సమయంలో జగన్‌కు మద్దతుగా నిలవాలని భావించాం. ఇంకా ఆలస్యం చేస్తే బాగోదనే ఉద్దేశంతో బుధవారం జైల్లో జగన్‌ను కలిశా. ఇప్పుడు మర్యాదపూర్వకంగా విజయమ్మను కలిశాను’’ అని పేర్కొన్నారు.
Share this article :

0 comments: