అవిశ్వాసంపై విప్ జారీ చేసి టీడీపీ ఎమ్మెల్యేలను కట్టడి చేయడం సిగ్గుచేటని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ధర్మాన కృష్ణదాస్ అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా అవిశ్వాస తీర్మానంపై పునరాలోచించుకోవాలని సూచించారు. ప్రభుత్వ వైఖరితో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్కు టీడీపీ ముమ్మాటికీ తోకపార్టీయేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. కాంగ్రెస్ను కాపాడుతూ టీడీపీ రక్షణ కవచంగా మారిందని ఎద్దేవా చేశారు. అవిశ్వాసంపై టీడీపీ ఎమ్మెల్యలేకు విప్ జారీ చేయడాన్ని హరీష్రావు తప్పుబట్టారు.
0 comments:
Post a Comment