వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో ఆదివారం (174వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీ నర్ కుడుపూడి చిట్టబ్బాయి శనివారం ప్రకటించారు. అనపర్తి మండలం పొలమూరు పాకల నుంచి ఆదివారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. 6.5 కిలోమీటర్ల నడక అనంతరం మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 7.5 కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగిస్తారు. మండపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మండపేట కె.పి. రోడ్డు సమీపంలో రాత్రి బస చేస్తారు. ఆదివారం మొత్తం 14 కిలోమేటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు
పొలమూరు, రామవరం క్రాస్ రోడ్, అర్తమూరు, తాపేశ్వరం క్రాస్ రోడ్, మండపేట మెయిన్రోడ్, బస్టాండ్ సెంటర్, కలువపువ్వు సెంటర్, పొట్టి శ్రీరాములు రోడ్, రథం సెంటర్, కె.పి.రోడ్
పర్యటించే ప్రాంతాలు
పొలమూరు, రామవరం క్రాస్ రోడ్, అర్తమూరు, తాపేశ్వరం క్రాస్ రోడ్, మండపేట మెయిన్రోడ్, బస్టాండ్ సెంటర్, కలువపువ్వు సెంటర్, పొట్టి శ్రీరాములు రోడ్, రథం సెంటర్, కె.పి.రోడ్
0 comments:
Post a Comment