సీబీఐ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు. అదే తరహాలోనే రాష్ట్రంలో శాసనసభాపతి వ్యవస్థను కిరణ్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందన్నారు. శాసనసభాపతిపై కాంగ్రెస్-టీడీపీల ఒత్తిడి
పనిచేసిందన్నారు. 2 నెలల క్రితం అనర్హులుగా ప్రకటించివుంటే ఎన్నికలు జరిగివుండేవన్నారు. అప్పుడు ఎవరి బలం ఏంటో ప్రజలే తేల్చేవారని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సూచనల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. క్విడ్ప్రోకో అంటూ జగన్ను అన్యాయంగా జైలుపాలు చేశారన్నారు. అదే క్విడ్ప్రోకో మంత్రులకు ఎందుకు వర్తించదు? అని ఆయన ప్రశ్నించారు. 2జీ స్పెక్ట్రంలో సోనియా నిందితురాలు కాదా? అని పెద్దిరెడ్డి అడిగారు.
పనిచేసిందన్నారు. 2 నెలల క్రితం అనర్హులుగా ప్రకటించివుంటే ఎన్నికలు జరిగివుండేవన్నారు. అప్పుడు ఎవరి బలం ఏంటో ప్రజలే తేల్చేవారని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సూచనల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. క్విడ్ప్రోకో అంటూ జగన్ను అన్యాయంగా జైలుపాలు చేశారన్నారు. అదే క్విడ్ప్రోకో మంత్రులకు ఎందుకు వర్తించదు? అని ఆయన ప్రశ్నించారు. 2జీ స్పెక్ట్రంలో సోనియా నిందితురాలు కాదా? అని పెద్దిరెడ్డి అడిగారు.
0 comments:
Post a Comment