ప్రసన్నకు 50వేల మెజార్టీ: జూపూడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రసన్నకు 50వేల మెజార్టీ: జూపూడి

ప్రసన్నకు 50వేల మెజార్టీ: జూపూడి

Written By ysrcongress on Saturday, March 10, 2012 | 3/10/2012

కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 50 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించనున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు పేర్కొన్నారు. కోవూరు ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న జూపూడి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోవూరులో విస్తృత ప్రచారం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ అమోఘమన్నారు. పార్టీ అధ్యక్షుని ఆదేశానుసారం నాలుగురోజులుగా తనతోపాటు పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాష్‌రావు, మారెప్ప, నిర్మలాకుమారిలు దళిత వర్గాల్లో విస్తృత పర్యటన జరిపి ఓటర్లను చైతన్యపరుస్తున్నట్లు వివరించారు.
Share this article :

0 comments: