ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరగకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 16 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలపై వేటు వేశాక జగన్మోహన్రెడ్డిని కట్టడి చే సి ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే జగన్ను అరెస్టు చేస్తారనే సంకేతాలు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఏం జరిగినా ప్రజల మద్దతు తమకు ఉందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల భయంతోనే తమపై వేటు వేశారన్నారు. గత ఆరు నెలలుగా సీబీఐ విచారణలో జగన్ నేరం చేసినట్లు ఎక్కడా బయటపడలేదని, ఈ విషయం తెలిసీ సీబీఐ వ్యూహాత్మకంగా సాగతీత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. జగన్ సీఎం అయితేనే హరితాంధ్రప్రదేశ్ సాధ్యమన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీని విమర్శిస్తూ సీమాంధ్రలో లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
0 comments:
Post a Comment