వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు మాయాకూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. 2009లో మహాకూటమితో వైఎస్ఆర్ చేతిలో చంద్రబాబు ఖంగుతిన్నారని, 2014లో మాయాకూటమితో వైఎస్ కుమారుడు జగన్ చేతిలోనూ భంగపాటు తప్పదని వైఎస్ఆర్ సీపీ నేతలు శోభానాగిరెడ్డి, మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్లు జోస్యం చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగంగానే కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కైన విషయాన్ని,, ఇటీవల సహకార ఎన్నికల్లోనూ రెండు పార్టీలు మద్దతిచ్చుకున్న విషయాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించారు. చంద్రబాబుది 'వస్తున్నా మీకోసం' యాత్ర కాదని 'మోస్తున్నా.. మీకోసం' అంటూ కాంగ్రెస్ను అధికారంలో కొనసాగిస్తున్నారని శోభానాగిరెడ్డి విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగంగానే కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కైన విషయాన్ని,, ఇటీవల సహకార ఎన్నికల్లోనూ రెండు పార్టీలు మద్దతిచ్చుకున్న విషయాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించారు. చంద్రబాబుది 'వస్తున్నా మీకోసం' యాత్ర కాదని 'మోస్తున్నా.. మీకోసం' అంటూ కాంగ్రెస్ను అధికారంలో కొనసాగిస్తున్నారని శోభానాగిరెడ్డి విమర్శించారు.
0 comments:
Post a Comment