చట్టం, న్యాయ నిబంధనలు, జైలు మాన్యువల్ ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ములాఖత్లలో రాజకీయ నాయకులను కలుసుకుంటున్నారని, ఈ విషయం సాక్షాత్తూ జైళ్ల శాఖ ఉన్నతాధికారి కృష్ణరాజు చెప్పారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా జగన్ ములాఖత్లు జరుగుతున్నాయంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు, కాంగ్రెస్ నేతలు వీహెచ్, గండ్ర వెంకటరమణారెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలని స్పష్టంచేశారు.
ములాఖత్లపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని, చంచల్గూడ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే కనుక అక్కడ ములాఖత్లు సక్రమంగా జరుగుతున్నాయో, లేదో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి స్పష్టంగా ప్రకటన ఇవ్వాలని, ఆ బాధ్యత ఆయనపై ఉందని స్పష్టంచేశారు. పది నెలలుగా జైల్లో పెట్టినా జగన్కు ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గించలేకపోయామే అన్న కడుపుమంటతో, ద్వేషంతోనే టీడీపీ, కాంగ్రెస్ నేతలు నానా యాగీ చేస్తున్నారు తప్ప ఇసుమంతైనా వారి మాటల్లో నిజం లేదని ఉద్ఘాటించారు.
ములాఖత్లపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని, చంచల్గూడ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే కనుక అక్కడ ములాఖత్లు సక్రమంగా జరుగుతున్నాయో, లేదో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి స్పష్టంగా ప్రకటన ఇవ్వాలని, ఆ బాధ్యత ఆయనపై ఉందని స్పష్టంచేశారు. పది నెలలుగా జైల్లో పెట్టినా జగన్కు ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గించలేకపోయామే అన్న కడుపుమంటతో, ద్వేషంతోనే టీడీపీ, కాంగ్రెస్ నేతలు నానా యాగీ చేస్తున్నారు తప్ప ఇసుమంతైనా వారి మాటల్లో నిజం లేదని ఉద్ఘాటించారు.
0 comments:
Post a Comment