కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్కు పిచ్చిపట్టినందునే జగన్ను ఇతర రాష్ట్రాల జైలుకు తరలించాలంటున్నారని వారు మండిపడ్డారు. వీహెచ్కు పిచ్చి ముదిరితే ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటే మంచిదని వైఎస్ఆర్సీపీ సలహా ఇచ్చింది. వీహెచ్ నోటికి మున్సిపాలిటీ మోరీకి పెద్ద తేడా లేదని ఆపార్టీ గట్టు రామచంద్రరావు మంగళవారమిక్కడ అన్నారు. సోనియా, రాహుల్ కాళ్లు మొక్కడం తప్ప వీహెచ్కేమీ చేతకాదని గట్టు అన్నారు. సొంతవార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేని చరిత్ర వీహెచ్ దని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ మరణంపై కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అవహేళన చేయటం తగదన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని గట్టు సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వారిని ఓడిస్తారని ఆయన అన్నారు.
తిరుపతి: కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు వ్యాఖ్యల వెనక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరుణాకర రెడ్డి, ఎన్.అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలే వైఎస్ కుటుంబంపై మాట్లాడిస్తున్నారన్నారు. వీహెచ్ ఒక బ్రోకర్, తన భార్య చేత కూడా ఓటు వేయించుకోలేని వ్యక్తి అన్నారు. ఇలాంటి కుట్రలకు వైఎస్ఆర్ సిపి బెదరదన్నారు. దేశంలో ఏ జైలు కైనా నిబంధనలు ఒక్కటేనని చెప్పారు. వైఎస్ జగన్ ఎక్కడ ఉన్నా నేతలు కలుస్తూనే ఉంటారన్నారు.
0 comments:
Post a Comment